బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు 

22 Jun, 2022 16:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా రోడ్ల మరమ్మతుల కోసం బీబీఎంపీ రూ.23 కోట్లు ఖర్చుచేసింది. ప్రతి నిమిషానికి రూ.5 లక్షల 18 వేలు వ్యయమైంది. సోమవారం బెంగళూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మోదీ సంచరించిన 14 కి.మీ పొడవునా రోడ్లకు తారు వేయడం, ఫుట్‌పాత్, వీధిదీ పాలు, డ్రైనేజీల శుభ్రం తదితర పనులకు ఎ క్కువ నిధులు ఖర్చయినట్లు ప్రత్యేక కమిషనర్‌ రవీంద్ర తెలిపారు. సభ జరిగిన కొమ్మఘట్ట రోడ్డు చుట్టుపక్కల రోడ్ల మరమ్మతులకు, సుందరీకరణ ఖర్చులకు రూ.9 కోట్లు వెచ్చించారు. 
చదవండి: అసమాన యోగయజ్ఞం

మరిన్ని వార్తలు