మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం

17 Mar, 2021 10:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎస్‌ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్, మహిళా నేత, నటి రాధికా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ మేరకు ఎస్‌ఎంకే వర్గాలు మంగళవారం ప్రకటించాయి. కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యంతో కలిసి ఎస్‌ఎంకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఎస్‌ఎంకే 37 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఈ అభ్యర్థుల జాబితాను శరత్‌కుమార్‌ ప్రకటించారు. ప్రతి ఎన్నికల్లోనూ శరత్‌కుమార్‌ పోటీ చేస్తూ వచ్చారు. ఈ సారి రాధిక కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా ఇది వరకే శరత్‌కుమార్‌ ప్రకటించారు. ఈ జాబితాలో ఆ ఇద్దరి పేర్లు లేవు. ఆ ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎస్‌ఎంకే ప్రకటించింది. అయితే కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇద్దరు ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు.

చదవండి: బెంగాల్‌ గెలుపు బీజేపీకి కీలకం 

మరిన్ని వార్తలు