పోలీస్‌ స్టేషన్‌పై రాకెట్‌ లాంచర్‌ తరహా ఆయుధంతో దాడి..

10 Dec, 2022 10:52 IST|Sakshi

పంజాబ్‌లోని ఒక పోలీస్‌ స్టేషన్‌పై తెల్లవారుజామున రాకెట్‌ లాంచర్‌ తరహా ఆయుధంతో దాడి జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్‌ తరణ్‌లో ఉన్న సర్హాలి పోలీస్‌ స్టేషన్‌ భవనంపై జరిగింది. తెల్లవారుజామున 1 గంటకు దాడి జరిగిందని, భవనానికి స్వల్ప నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

రాకెట్‌ లాంచర్‌ రకం ఆయుధం మొదట స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై పోలీస్‌ స్టేషన్‌ను తాకినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌లో మరణిస్తున్నట్లు భావిస్తున్న ఖలిస్తాని ఉగ్రవాది హర్విందర్‌ సింగ్‌ రిండా స్వస్థలం కూడా సర్హాలినే. రిండా నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కి చెందిన సభ్యుడు.

అతనిపై ఈ ఏడాది మేలో పంజాబ్‌ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పీజీ దాడితో సహా పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి సూత్రధారిని పోలీసులు శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

(చదవండి: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..)

>
మరిన్ని వార్తలు