ప్రశాంత్‌ భూషణ్‌: తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీం

29 Aug, 2020 19:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సంబంధించిన కోర్టు దిక్కారణ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్లపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్‌ భూషణ్‌కు జూలై 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంత‌కు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు