జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

28 Jan, 2021 09:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో ఓ ఇల్లు నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కూకట్‌పల్లికి చెందిన శాలివాహనరెడ్డి హఫీజ్‌పేట సర్వే నంబరు 78లోని 461 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అంటూ జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదు. శాలివాహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, సదరు సర్వే నంబరులో అనేక భవంతులు వెలిశాయని, తనకు మాత్రం ప్రభుత్వ భూమి అంటూ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

ఈ క్రమంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, శాలివాహనరెడ్డికి రూ.10వేలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే)

మరిన్ని వార్తలు