మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ‌ పాక్‌-చైనా దొంగ‌బుద్ధి

24 Oct, 2020 14:07 IST|Sakshi

పాకిస్తాన్‌కి చెందిన క్వాడ్ ‌కాప్ట‌ర్‌ను మ‌ట్టుబెట్టిన భార‌త ఆర్మీ 

శ్రీన‌గ‌ర్ : పాకిస్తాన్ మ‌రోసారి త‌న దుర్భుద్ధిని ప్ర‌ద‌ర్శించింది. చైనాతో  క‌లిసి బాంబుల దాడికి ప్ర‌య‌త్నించ‌గా, భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. జ‌మ్ముక‌శ్మీర్‌లో కేర‌న్ సెక్టార్‌లోని నియంత్ర‌ణ రేఖ (ఎల్‌వోసీ )వ‌ద్ద పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్వాడ్‌కాప్టర్‌ను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఈ ఉద‌యం 8 గంట‌ల‌కు జ‌మ్ముక‌శ్మీర్ ల‌క్ష్యంగా బాంబుల దాడికి కుట్ర ప‌న్నింది. ఈ క్వాడ్‌కాప్టర్  చైనా కంపెనీకి  చెందిన డిజెఐ మావిక్ 2 ప్రో మోడల్‌గా భార‌త సైన్యం గుర్తించింది. 
 

మరిన్ని వార్తలు