సివిల్స్‌ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..

26 Sep, 2020 22:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య  ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు  రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్‌ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు  అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం నగరాలకు చేరుకోనున్నాయి. 

అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు