శేఖర్‌ గుప్తా‌: బెంగాల్‌ తీర్పుతో బీజేపీ తెలుసుకోవాల్సింది

2 May, 2021 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల మినహా బీజేపీ ఘోర పరాభవమే ఎదుర్కొంది. దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ వేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తమిళనాడు, కేరళలో ఓటర్లు ఆ పార్టీని ఆదరించకపోగా.. అధికారమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్‌లో పోరాడిన బీజేపీకి మిశ్రమ ఫలితం దక్కింది. అధికారానికి చాలా దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అయితే బీజేపీ ఓటమి చెందడానికి కారణాలను ప్రముఖ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా వివరిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. బీజేపీ ఓటమి చెందడంపై మూడు కారణాలను వివరించారు.

  • నరేంద్ర మోదీ హయాంలో బీజేపీకి ఇది ఘోర ఓటమి.
  • బీజేపీ మత రాజకీయాలు దేశవ్యాప్తంగా పని చేయవు.
  • హిందీ, గుజరాత్‌ ప్రాంతాల్లో తప్ప దేశంలోని ఇతర భూభాగాల్లో మోదీ హవా కొనసాగదు.

చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్‌

మరిన్ని వార్తలు