దేశంలో మరింత తగ్గుముఖం పట్టిన కరోనా

27 Dec, 2020 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది.  గడిచిన 24 గంటల్లో దేశంలో 18,732 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది. 279 మంది మృత్యువాత పడడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,622కు చేరింది. ఇవాళ కరోనా నుంచి కొత్తగా 21,430 కోలుకోగా.. మొత్తం 97,61,538 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 2,78,690 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో కరోనా రికవరీ రేటు 95.77 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు