సోనియా గాంధీ ఇంట​ విషాదం.. తల్లి మైనో కన్నుమూత

31 Aug, 2022 17:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో.. ఇటలీలో ఈ నెల 27వ తేదీన కన్నుమూశారు. కాగా, ఆమె అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు