మధ్యప్రదేశ్‌లో వింత పెళ్లి.. బ్యాండ్‌ బాజాలతో ఘనంగా చిలుక వివాహం!

8 Feb, 2023 15:31 IST|Sakshi

పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఉండే రామ్‌స్వరూప్‌ పరిహర్‌ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు.

అలాగే బాదల్‌​ లాల్‌ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్‌ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్‌  తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు.

ఈ పెళ్లికి బాదల్‌ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్‌, ఆదిత్య పటేల్‌, పితమ్‌ పటేట్‌, దేవి సింగ్‌ పటేల్‌, ఆశోక్‌ పటేల్‌, రాజు పటేల్‌, పురుషోత్తం శివన్య, సునీల్‌ పటేల్‌, విమేలేష్‌ పటేల​ తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్‌ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. 

(చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..)

మరిన్ని వార్తలు