అఫ్గాన్‌ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు

17 Aug, 2021 03:40 IST|Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్‌ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్‌ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్‌ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్‌ ఎయిర్‌పోర్టు అధికారులు నోటమ్‌ (పైలట్లకు హెచ్చరిక నోటీస్‌) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్‌ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్‌ ఇండియా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్‌ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్‌–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు