నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

7 Jan, 2022 11:32 IST|Sakshi

న్యూఢిల్లీ: నీట్‌ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా 2021-22 ఏడాదికి సంబంధించి నీట్‌-పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోర​ర్ట పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్‌.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. 

మరిన్ని వార్తలు