జీవో నంబర్‌ 1పై నేడు సుప్రీంకోర్టు విచారణ 

19 Jan, 2023 07:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమాయక ప్రజలు మృతిచెందకుండా బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉం­డేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది.

హై­కో­ర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దా­ఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించా­లని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహ్‌ఫూ­జ్‌ నజ్కీ బుధవారం సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ ఉందని ప్రతివాది రామకృష్ణ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంత­రం అత్యవసర విచారణకు అంగీకరించిన సీజేఐ గు­రు­వారం జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.   
 

మరిన్ని వార్తలు