Telugu Academy: ఏపీకి పెండింగ్‌ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు

29 Apr, 2022 12:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విజభన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ. 33 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే పిటిషన్‌కు వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఏపీకి ఇప్పటికే రూ. 92.94కోట్లు చెల్లించినట్టు తెలంగాణ సర్కార్‌ తెలిపింది. అయితే, మిగిలిన డబ్బు మొత్తానికి 6శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  

ఇది కూడా చదవండి: సీఎం స్టాలిన్‌ కుమారుడికి భారీ ఊరట

మరిన్ని వార్తలు