అత్యాచారం కేసులో యువకుడికి ఉరిశిక్ష రద్దు 

20 Mar, 2021 08:49 IST|Sakshi
మద్రాస్‌ హై కోర్టు (ఫైల్‌ఫోటో)

టీ.నగర్‌: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో యువకుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను గురువారం హైకోర్టు రద్దు చేసింది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన అశోక్‌కుమార్‌ (27) గత 2017లో 13 ఏళ్ల బాలికపై హత్యాచారం  చేసి అరెస్టయ్యాడు. కేసు విచారణ జరిపిన చెంగల్పట్టు ప్రత్యేక కోర్టు అశోక్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో అశోక్‌కుమార్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరి శిక్ష రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

చదవండి: లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?!

మరిన్ని వార్తలు