తీరాన్ని తాకిన తౌక్టే తుఫాన్

17 May, 2021 21:46 IST|Sakshi

గాంధీనగర్‌:  తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే గజరాత్‌లో తీరాన్ని తాకింది. ఇక మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతుండగా సహాయక చర్యల్లో కోసం ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. గుజరాత్‌ ప్రభుత్వం తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

( చదవండి: పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ బీభత్సం.. )

మరిన్ని వార్తలు