CM KCR Delhi Tour Updates: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ..

22 May, 2022 12:52 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాలతో సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుత పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్‌ వెళ్లనున్నారు. 

మరిన్ని వార్తలు