Evening Top 10 Telugu News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

23 Jul, 2022 17:00 IST|Sakshi

1.. టీడీపీ జెండాలతో చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నాడు: మంత్రి అంబటి
వర్షాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌పై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. ఉక్రెయిన్‌ టూ భారత్‌: వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం
ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విదేశాలు స్వదేశాలకు తిరుగుపయనమైన విషయం తెలిసిందే. కాగా, భారత్‌కు చెందిన మెడిసిస్‌ విద్యార్థులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..కొత్తగా 13 మండలాలు
ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్‌) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Thank You Box Office Collection: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్‌
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన థాంక్యూ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో  వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం  తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దిగ్గ‌జం.. ఏం చేశాడో చూడండి..!
విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.  ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై భారీ తగ్గింపు
ఇ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022  నేటి (జూలై 23న)  అర్థరాత్రి ప్రారంభం కానుంది.  ఈసేల్‌లో ఐఫోన్‌ 12  రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 41 కోట్లు తగ్గనున్న భారత్‌ జనాభా.. నివేదికలో షాకింగ్‌ విషయాలు
భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే!
సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ  తెలుసుకుందాం.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఐదో అంతస్థు నుంచి కిందపడిన చిన్నారి.. దేవుడిలా వచ్చి..
ఎత్తైన భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడుతున్న చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి పట్టుకొని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు