భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం

16 Jun, 2021 09:43 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌: శ్రీనగర్‌లోని నౌగం ప్రాంతంలోని వగూరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగపడిపట్లు వెల్లడించారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. మరో ఉగ్రవాది ప్రాణాలతో చిక్కినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి పిస్తోల్‌, మ్యాగజైన్‌, 6 రౌండ్ల బుల్లెట్లు, 2 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

చదవండి: బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా

>
మరిన్ని వార్తలు