Karnataka Train Accident: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్‌ రైలు.. వీడియో వైరల్‌

7 Jul, 2022 15:00 IST|Sakshi

Train Rams Into A Truck On A Railway Crossing.. రైల్వే గేట్‌ క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీదర్‌లోని భాల్కీ రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై ఓ ట్రక్కు నిలిచిపోయింది. 

అయితే, ట్ర​క్కు పట్టాలపైకి రాగానే ఇంజిన్‌ స్టార్ట్‌ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. ఇంతలో ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్‌ రైలు ట్రక్కును ఢీకొట్టింది. కాగా, రైల్వే అధికారులు, స్థానికులు లోకోమోటివ్ పైలట్‌కు సకాలంలో సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ మృతి చెందకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: జోర్దార్‌ వీడియో: జోరు వానలోనూ.. నీ యవ్వ తగ్గేదే లే!

మరిన్ని వార్తలు