బియ్యం వ్యాపారంలోకి హిజ్రాలు

14 Oct, 2021 07:00 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు: చెన్నైలో తొలిసారి 40 మంది హిజ్రాలు బియ్యపు వ్యాపారంలోకి ప్రవేశించారు. చెన్నైలో హిజ్రాలు స్వయం ఉపాధి కల్పనతో పలు వృత్తుల్ని స్వీకరిస్తున్నారు. వారికి పలు స్వ చ్ఛంద సంస్థలు సహకారం ఇస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాయపేటలో తొలిసారి టీ దుకాణం, చాకలిపేటలో టిఫిన్‌ దుకాణాలు ఏర్పాటు చేశా రు. అంతేకాకుండా ఓ సంఘంగా ఏర్పడి 40 మంది హిజ్రాలు  చెన్నై మైలాపూరులో బియ్యం వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వారికి 400 బస్తాల బియ్యాన్ని స్వచ్ఛంద సంస్థలు అందజేశా యి. హిజ్రా నర్తకి నటరాజ్, డాక్టర్‌ మాలతి, జయ, సబిత తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (ప్రాణం తీసిన చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం?)

మరిన్ని వార్తలు