ఇద్దరు మంత్రులకు కరోనా..

29 Jul, 2020 17:52 IST|Sakshi

భోపాల్‌: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా సామాన్యులు మొదలుకొని మధ్యప్రదే్శ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దాకా అందరూ కరోనా బాధితులే. అయితే తాజాగా రాష్ట్ర మంతివర్గంలోని మరో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నీటి వనరుల శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్‌కు కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే కరోనా సోకిన విషయాన్ని మంత్రి తులసీరామ్‌ స్వయంగా తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేయగా.. మరో మంత్రికి కరోనా సోకిన విషయాన్ని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

(మధ్యప్రదేశ్‌ సీఎం‌కు కరోనా పాజిటివ్‌)

 

మరిన్ని వార్తలు