అదృష్టం అంటే వీళ్లది.. రూ. 10కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు

31 May, 2022 09:42 IST|Sakshi

అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప‍్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్​, అతని బంధువు ఎన్ రమేశ్​కు కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది.

ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్‌ వద్ద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఇక, ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్‌పాట్‌ తగిలింది. డ్రాలో వీరి టికెట్‌కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్​కు వెళ్లి టికెట్​తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం

మరిన్ని వార్తలు