సాక్షి, కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 8వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి.రామస్వామి ’సాక్షి’కి తెలిపారు. ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి కర్నూలు జిల్లాతో పాటు హిందూపురంలో పర్యటిస్తారని పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా కర్నూలు నగరంలోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తారని తెలిపారు. అనంతరం నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
చదవండి: (ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్)