ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానంపై కేంద్రం క్లారిటీ

17 Dec, 2022 12:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఓటర్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ చేయకపోయినా ఓటర్ల జాబితాలో వారి పేరు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ఈ మేరకు బదులిచ్చారు.

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం యోచన లేదు
దేశంలో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మరొక ప్రశ్నకు బదులుగా రిజిజు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు

మరిన్ని వార్తలు