ఉత్తర కాశీ దుర్ఘటన.. 27కు చేరిన మృతులు

10 Oct, 2022 06:54 IST|Sakshi

ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరింది. ఘటనాస్థలిలో ఆరు రోజులుగా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్న సిబ్బంది ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ నెల 4వ తేదీన 17 వేల అడుగుల ఎత్తులో మంచుచరియలు పడి విషాదం చోటు చేసుకుంది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెయినీరింగ్‌(ఎన్‌ఐఎం)లో శిక్షణ పొందుతున్న 27 మంది, ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లు ‘ద్రౌపదీ కా దండా–2’ శిఖరం నుంచి వెనుదిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 21 మృతదేహాలను గుర్తించి, సంబంధీకులకు అధికారులు అందజేశారు. మరో ఇద్దరు ట్రైనీల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌ఐఎం పేర్కొంది.

ఇదీ చదవండి: Bharat Jodo Yatra: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు

మరిన్ని వార్తలు