తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం

16 Aug, 2020 05:29 IST|Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు  అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్‌ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్‌ మాస్క్, ఫేస్‌ కవర్‌ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకొని రావాలన్నారు. 

మరిన్ని వార్తలు