రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లు.. వాహనం బోల్తాకొట్టడంతో పండగ చేసుకున్న జనం

11 May, 2022 16:28 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని మధురై హైవేపై రూ.10 లక్షల విలువైన మద్యం లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లన్ని ఒక్కసారిగా రహదారిపై అడ్డంగా పడిపోయాయి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదన్నట్లుగా అక్కడ ఉండే స్థానికులు ఎగబడ్డారు. ఆ బాటిళ్లను ఎత్తుకుపోవడం ప్రారంభించారు. దొరికినంత దోచుకుని పండగ చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.

ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ని క్లియర్‌ చేసేందుకు ఉపక్రమించారు. కేరళలోని మనలూర్‌లో ఉన్న గోదాం నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ వాహనాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడంతో అదుపుతప్పి బొల్తాపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

(చదవండి: క్రేజీ లవ్‌: గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం మొత్తం గ్రామానికే కరెంట్‌ లేకుండా చేశాడు)

మరిన్ని వార్తలు