Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్‌ను కదిలిస్తున్న వీడియో చూశారా?

26 Jul, 2022 10:26 IST|Sakshi

వైరల్‌: సోషల్‌ మీడియాలో రకాల రకాల కంటెంట్‌ వైరల్‌ అవుతుంటుంది. నెటిజన్లను ఆకట్టుకునేది కొంతే అయితే.. చిరాకు తెప్పించేది ఎంతో. కానీ, కొన్ని వీడియోలు మాత్రం భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇంకొన్ని అస్లీ జిందగీని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.  

ఒకతను అలసిపోయినట్లు కనిపించడంతో, అతని కుమార్తె తన తండ్రికి అపారమైన ప్రేమతో పండ్లు తినిపించింది. పండు తిన్న తర్వాత తండ్రి తన కూతురిని ఆప్యాయంగా హత్తుకుంటాడు. అలా ఆ తండ్రీబిడ్డల ప్రేమ తాలుకా వీడియో హార్ట్‌ టచింగ్‌ వీడియోగా వైరల్‌ అవుతోంది.  ప్రయాణాలు నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కొందరు ప్రయాణాలను సులువుగా మరిచిపోతారు.. మరికొందరికి మాత్రం ప్రయాణాలు మరిచిలేని గుర్తులను మిగులుస్తాయి. 

A post shared by Sakshi Mehrotra (@sankisakshi)

అలా.. ప్రయాణంలో ఉన్న డిజిటల్‌ క్రియేటర్‌ సాక్షి మెహ్రోత్రాకు ఈ తండ్రీబిడ్డల మమకారపు క్షణాలు కంటపడేసరికి.. సంబురంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. సంతోషానికి మించిన సంపద ఏముంటుంది? చెప్పండి. ముంబై లోకల్‌ ట్రైన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రేమపై మీ కామెంట్‌ను తెలియజేయండి. 

మరిన్ని వార్తలు