Vijay Sampla: జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌గా విజయ్‌ సాంప్లా

28 Apr, 2022 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌ సాంప్లా ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్‌సీఎస్సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  

చదవండి: (క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో)

మరిన్ని వార్తలు