‘విక్రమ్‌’ ప్రయోగం వాయిదా

14 Nov, 2022 06:45 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా ప్రైవేట్‌రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది.

నవంబర్‌ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్‌ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు.

మరిన్ని వార్తలు