Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి

30 Sep, 2021 13:25 IST|Sakshi

ఇటీవల సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకోకుండా అవి వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయ్ కూడా. తాజాగా ఓ రోడ్‌ సైడ్‌ పుడ్‌ స్టాల్‌ యజమాని ఇలానే భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. 

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్‌ స్టాల్‌ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్‌ లవర్స్‌కి బంఫర్‌ ప్రకటించాడు. ఇక ఆ రోల్‌ మేకింగ్‌ వీడియోని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో నింపేశాడు.

చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. దీనంతటనీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పుడ్‌ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఆసక్తిగా ఉన్నా, రోల్‌ టేస్టీగా ఉన్నా.. ఆ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తినాలంటే ఎంతటి భోజనప్రియులకైనా కొంచెం కష్టమే మరీ. అది కూడా 10 కేజీలు బరువు గల ఆహారం అంటే.. మామూలు విషయం కాదండి. అందుకే ఏమో అంత ధైర్యంగా ఆ ఛాలెంజ్ విసురుతున్నాడు.

A post shared by THE FOOD CULT - TFC (@the.food_cult)

చదవండి: ‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ 


 

మరిన్ని వార్తలు