రైల్వే స్టేషన్‌లో యువతి హుషారైన స్టెప్పులు.. 25 మిలియన్ల వ్యూస్‌..

16 Oct, 2021 16:43 IST|Sakshi

రైల్వే స్టేషన్‌లో  ‘సాత్‌ సముందర్‌ పార్‌’ అనే పాటకు యువతి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సహేలీ రుద్ర అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ప్ల్యూయెన్సర్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద అందరూ చూస్తుండగానే రీమిక్స్‌ పాటకు స్టెప్పులేసింది. ముఖానికి మాస్క్‌ ధరించి అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుంటే పక్కన ఉన్న వారంతా హుషారెత్తించారు.
చదవండి: ఫ్రెండ్స్‌తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్‌ వాట్‌ ఏ డ్యాన్స్‌ అంటున్న నెటిజన్స్‌!

ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు 25 మిలియన్లకు పైగా వీక్షించారు. 1.5 మిలియన్‌ లైక్‌లు, 18.8 వేల కామెంట్లు సొంతం చేసుకుంది. కాగా సాత్ సముందర్ పార్ పాట విశ్వాత్మ చిత్రంలోనిది. దివంగత నటి దివ్య భారతి, సన్నీ డియోల్‌పై ఈ పాటని చిత్రీకరించారు.  
చదవండి: టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!

A post shared by Saheli Rudra | Influencer (@_sahelirudra_)

మరిన్ని వార్తలు