కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

1 Jun, 2021 19:49 IST|Sakshi

ఐజ్వాల్​:  కరోనా సోకిన తన భార్యను ఆమె భర్త ఐసోలేషన్​ వార్డుకు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  వివరాలు.. మిజోరాంకు చెందిన దంపతులలో , సదరు వ్యక్తి భార్యకు కరోనా సోకింది. సాధారణంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మహమ్మారి వెంటనే సోకుతుంది. అయితే, తన భార్యను ఐసోలేషన్​ సెంటర్​కు తీసుకెళ్లాటానికి ఆమె భర్త వినూత్నంగా ఆలోచించాడు. అతని జీప్‌​కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమె కూర్చివేసుకొని హాయిగా కూర్చుంది. ఇలా ఐసోలేషన్‌ వార్డుకు తరలించాడు. 

అయితే, ఈ వీడియోను ఐపీఎస్​ అధికారి రిపున్​ శర్మ సోషల్​ మీడియా వేదికగా పోస్ట్​ చేశారు. ఇప్పుడిది వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్​.. మీ భార్య అదృష్ట వంతురాలు’,  ‘ మీ తెలివికి హ్యాట్సాఫ్​’, అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా మిజోరాంలో వైరస్​ ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో 312 కొత్త కేసులు నమోదైయ్యాయి. 41 మంది చనిపోయారు. అదే విధంగా రాష్ట్రంలో 3,144 కేసులు ఆక్టివ్​ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.  

చదవండి:  నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..

చదవండి: బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే..

>
మరిన్ని వార్తలు