ఎయిర్‌పోర్ట్‌లో అనుకోని అతిథి.. ఎంచక్కా జ్యూస్‌ తాగి, పుడ్‌ తిని సైలెంట్‌గా..

2 Oct, 2021 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కోతులు జన సంచారంలో రావడం, కాసేపు షికారు కొట్టి వెళ్లడం సాధారణంగానే జరుగుతుంటాయి. అయితే పటిష్ట భద్రత ఉండే ప్రదేశాలకు మనుషులు వెళ్లాలంటేనే అనుమతులు ఉండాలంటూ నిరాకరిస్తుంటారు. అలాంటిది ఓ కోతి మాత్రం ఎంచకా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ వీఐపీ లాంజ్‌లో అతిథిలా వచ్చి ఏం కావాలో తినేసి సైలెంట్‌గా వెళ్లింది. ప్రస్తుతం ఆ వానరం చేసిన హంగామా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో.. ఓ కోతి ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో.. నేరుగా విమానాశ్రయంలోని వీఐపీ లాంగ్‌లోకి వచ్చేసింది. అలా వచ్చిన వానరం ప్రయాణికులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న పుడ్‌ తినేసి, ప్రూట్‌ జ్యూస్‌ తాగేసి ఎంచక్కా వెళ్లిపోయింది. అలా కోతి ఎంజాయ్ చేయ‌డాన్ని కొందరు ప్ర‌యాణీకులు త‌మ ఫోన్ల‌లో రికార్డు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. విమానాశ్ర‌యంలోకి వీఐపీ గెస్ట్ వ‌చ్చాడు రోయ్‌ అంటూ కొంద‌రు కామెంట్ చేయ‌గా, హలో బాస్‌ క్రెడిట్ కార్డు స్వైప్ చేయకుండా వెళ్తున్నారు అంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్‌ చేశాడు. కాగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘ‌ట‌న‌ జరిగినట్లు అధికారులు ధ్రువీక‌రించారు గానీ ఏ రోజు జ‌రిగింద‌నే వివ‌రాలు మాత్రం వెల్ల‌డించలేదు. 

చదవండి: Viral:ఓ పక్క ఫోన్‌.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్‌

మరిన్ని వార్తలు