యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

11 Dec, 2020 10:13 IST|Sakshi

లక్నో: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుభవార్త చెప్పారు. నెల రోజల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్నారు. గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌లో నిర్వహించిన ‘హెల్తీ ఈస్టర్న్‌ ఉత్తరప్రదేశ్’‌ కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహమ్మారి విజృంభిస్తోంది. అభివృద్ధి చేందిన అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ మరణాలు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు 8 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం 1.04 శాతంగా మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మరో నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.  కరోనా కట్టడి కోసం మనం చేస్తోన్న కృషిని ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో అభినందించింది’ అని తెలిపారు యోగి. (చదవండి: ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్‌ గుణపాఠం)

సమిష్టి కృషితో ఎంతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎయిమ్స్‌ వంటి వైద్య శాలలు ఈ అంశంలో తమ పాత్ర పోషించాలి అన్నారు యోగి. వైద్య సంస్థలు ఈ రంగంలో మరెంతో కృషి చేయాలని తెలిపారు. బస్తీ డివిజన్లు, తూర్పు, ఉత్తర బిహార్‌, నేపాల్‌కు చెందిన దాదాపు ఐదు కోట్ల మందికి గోరఖ్‌పూర్‌ బాధ్యత వహిస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు