ఆ ఒక్క కారణంతో పిల్లనివ్వడం లేదు

20 Feb, 2021 09:07 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: వ్యవసాయం బాటపడుతున్న యువ రైతులకు వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ పిల్లనివ్వడంలేదని, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని ఒక యువరైతు విజ్ఞప్తి చేసుకున్న ఆడియో రామనగరలో వైరల్‌గా మారింది. మళవళ్లికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు ఎమ్మెల్సీ యోగేశ్వర్‌కు కాల్‌ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను ఉద్యోగం దొరక్క వ్యవసాయం చేసుకుంటున్నానని, వ్యవసాయం చేస్తున్నాననే ఒక్క కారణంతో తనకు వివాహం కావడం లేదని, అదే పట్టణంలో కూలి పనిచేస్తున్నా పిల్లనిస్తున్నారని, తనకు 35 సంవత్సరాలు వచ్చాయని, అందువల్ల ప్రభుత్వంతో చర్చించి ఒక చట్టం తీసుకురావాల్సిందిగా కోరాడు. స్పందించిన యోగేశ్వర్‌  ఈ విషయంపై చర్చిద్దాం అంటూ ఆ యువ రైతును ఓదార్చాడు. 

చదవండి: భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి
చదవండి: కూతురిని విక్రయించి.. భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి

మరిన్ని వార్తలు