Zerodha: బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

26 Sep, 2022 05:36 IST|Sakshi

ఉద్యోగులకు సీఈఓ బంపర్‌ ఆఫర్‌

ముంబై: జెరోడా అనే ఆన్‌లైన్‌ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్‌ కామత్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్‌ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట.

అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్‌ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్‌. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు