CoronaVirus: మన కాక్​టెయిల్​ ట్రయల్స్​​కి పర్మిషన్​

27 May, 2021 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్​లో ట్రీట్​మెంట్ కొరత ప్రధాన సమస్యగా మారింది. మందులు, వ్యాక్సిన్​ల కొరత కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల మీద ప్రభుత్వాల దృష్టి మళ్లుతోంది. ఇప్పటికే భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్​మెంట్​కు పర్మిషన్​ దొరికింది. ఈ క్రమంలో జైడస్​ కాడిల్లా క్లినికల్​ ట్రయల్స్​ కోసం అనుమతులు దక్కించుకుంది. మైల్డ్​ సింప్టమ్స్(ఓ మోస్తరు) లక్షణాలున్న​కోవిడ్ పేషెంట్లలో జైడస్​ వారి యాంటీబాడీ కాక్​టెయిల్​ని మనుషులపై ప్రయోగించి చూసేందుకు లైన్​ క్లియర్​ అయ్యింది. 

గుజరాత్​కు చెందిన జైడస్​ కాడిల్లా వారి జెడ్ఆర్​సీ-3308, ట్రయల్స్​ దశలో జంతువుల లంగ్​ డ్యామేజ్​ను తగ్గించింది. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్​తో ఉండే కాక్​టెయిల్​, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాల తరహాలో ఇన్​ఫెక్షన్​తో పోరాడుతుందని జైడస్​ కాడిల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్​మెంట్​లో పురోగతి అవసరమని జైడస్​ కాడిల్లా ఎండీ శార్విల్​ పటేల్​ తెలిపారు. మనుషుల ఎర్లీ టు లేట్​ స్టేజ్​ ట్రయల్స్​ కోసం డ్రగ్స్​ కంట్రోలర్ జనరల్ ఆఫ్​ ఇండియా నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలిపారు. 

ఇంతకు ముందు అమెరికాలోనూ అక్కడి ఫుడ్ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ట్రీట్​మెంట్స్​కి అనుమతి చ్చింది. రెగెనెరోన్​, రోచె యాంటీ బాడీ కాక్​టెయిల్ ఇదివరకే భారత్​లో అనుమతులు దక్కించుకోగా, ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దానిని సరఫరా చేస్తోంది.

ఇది చదవండి: కాక్​టెయిల్ హైరిస్క్​ తప్పిస్తుంది!

మరిన్ని వార్తలు