పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి

14 Mar, 2023 12:52 IST|Sakshi
మాట్లాడుతున్న మహమ్మద్‌

నర్సాపూర్‌(జి): ఉపాధిహామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కా ర్యదర్శి సయ్యద్‌ మహమ్మద్‌ అన్నారు. మండలంలోని గొల్లమాడ గ్రామంలో సోమవారం ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడారు. రోజుకు రూ.600 కూలీ, సామగ్రి అందించాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్‌, మెడికల్‌ కిట్‌ లేక కార్మికులు అవస్థలు పడుతున్నారని.. అధికారులు సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శాంతకుమారి, రేణుక, కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు