బాన్సువాడ టౌన్: బాన్సువాడ వైపు నుంచి బిచ్కుంద మండలం గుండెనెమ్లి రైస్మిల్కు వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీని గురువారం రాత్రి బాన్సువాడ పోలీసులు పట్టుకున్నారు. గుండెనెమ్లి రైస్మిల్ నుంచి పీడీఎస్ బియ్యం ఎఫ్సీఐకి పంపించామని అక్కడి అధికారులు బియ్యంను రిజక్ట్ చేయడంతో తిరిగి రైస్మిల్కు తీసుకువస్తున్నామని రైస్మిల్ యజమాని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు లారీని తహసీల్దార్కు అప్పగించారు. పీడీఎస్ బియ్యం తరలించినట్లు అధికారులు విచారణలో తేలితే, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ మహేందర్రెడ్డి తెలిపారు.