పోలీసులున్నా.. రోడ్డుపైనే తాగేస్తున్నారు..

24 May, 2023 09:26 IST|Sakshi

నిజామాబాద్‌ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌ రోడ్డులో సోమవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ.. చలాన్లు విధిస్తున్నారు. మరోపక్క అదే రోడ్డులోని వైన్స్‌ దుకాణం ఎదురుగా గల డివైడర్‌పై ఇద్దరు మందు బాబులు మద్యం తాగుతూ, దారిన పోయే ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నారు.

పక్కనే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, మందుబాబులు మద్యం తాగడంపై పలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులు వారిని పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు