నిజామాబాద్అర్బన్: నగరంలో నారాయణ కార్పొరేట్ పాఠశాల ఫ్లెక్సీలను గురువారం విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు చించివేశారు. సుభాష్నగర్లో ఇటీవల నారాయణ పాఠశాల నూతనంగా ప్రారంభమైంది. దీనికి అనుమతి లేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థ కనీస నిబంధనలు పాటించకుండా రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు బ్రోచర్లతో ఎక్కడో వచ్చినా ర్యాంకులు, మార్కులను నిజామాబాద్లోని వని ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేసి అడ్మిషన్లు చేస్తున్నారని అన్నారు. నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు మహేష్ రెడ్డి పాల్గొన్నారు .