ఇందల్వాయి: మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిత్యం ఏదో ఒక చోట లోపం బయటపడుతూనే ఉంది. గురువారం ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో లింగాపూర్ గ్రామం వద్ద మిషన్ భగీరథ గ్రిడ్ పైపులైన్ లీకేజీ కావడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడింది. లీకేజీ అయిన ప్రతీసారీ కలుషిత నీరు సరఫరా అవుతుందనే విమర్శలున్నాయి. పంట పొలాల నుంచి ప్రధాన పైపు లైన్లు ఉన్నందున పంటలు ఉన్న సమయంలో లీకేజీ జరిగితే ఆ నీటి ధాటికి పంటలు కొట్టుపోయే ప్రమాదం ఉంటుందని, లీకేజీలు కాకుండా సంభందిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లీకేజీ సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.