సీఎం జగన్‌ బర్త్‌డే: ఎన్‌ఆర్‌ఐ పార్టీ శ్రేణుల విరాళాలు

21 Dec, 2020 19:36 IST|Sakshi

వెల్లింగ్టన్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క ఏపీలోనే కాక విదేశాల్లోని పార్టీ శ్రేణులు సైతం ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి చారిటీలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ న్యూజిలాండ్‌ బృందం ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ న్యూజిలాండ్‌ పార్టీ శ్రేణులైన అనంద్‌ ఎద్దులా, పుష్పక్‌ కుర్ర, రమేష్‌ పనటి, విజయ్‌ ఆల్లా, మనోజ్‌ రెడ్డి, దయాకర్‌, రఘునాథ్‌ రెడ్డి, గురురాజ్‌ అన్నమరాజు, రాజేష్‌లు అక్లాండ్‌లోని చైల్డ్‌హెల్త్‌కు సంబంధించిన స్టార్‌షిప్‌ ఫౌండెషన్‌లో కేక్ కట్టింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఆనంతరం విరాళాలు అందించారు.

మరిన్ని వార్తలు