Texas : ప్రజల హృదయాల్లో వైఎస్సార్​కు శాశ్వత స్థానం

14 Jul, 2021 22:22 IST|Sakshi

హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు  నిలువెత్తు  నిదర్శనం డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి అంటూ  టెక్సాస్​కి చెందిన  ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు.  మహానేత ప్రియతమ నాయకుడు  డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి  72వ జయంతి వేడుకలను వైఎస్సార్​  ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా  హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు.  ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా  హాజరయ్యారు.  

మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు  చేసిన గొప్ప  సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్,  ఉచిత విద్యుత్​, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న  అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.  

ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి  విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు