ఏపీఎన్‌ఆర్‌టి కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి

11 Jan, 2021 09:36 IST|Sakshi

అమెరికా: గుంటూరు ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టి) అమెరికా రీజనల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్‌ ఇండస్ట్రీ  పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలకు అమెరికాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు