ఫ్రిస్కో సిటీ పార్క్స్‌ బోర్డు మెంబర్‌గా వేణు భాగ్యనగర్‌

7 Oct, 2021 15:03 IST|Sakshi

ఫ్రిస్కో (టెక్సాస్‌) : ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్‌ రిక్రియేషన్‌ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్‌ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్‌ రిక్రియేషన్‌ బోర్డు నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్‌కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది.

వేణు భాగ్యనగర్‌ స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా చేగుర్తి. ఆ జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. 

చదవండి: టెక్సాస్‌లో శ్రీశ్రీకి ఘన నివాళి

మరిన్ని వార్తలు