సింగపూర్‌లో వినాయక చవితి సంబరాలు

25 Aug, 2020 18:29 IST|Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శివన్ టెంపుల్‌లో వినాయక చవితి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ -19 నిబంధనలకి అనుగుణంగా అన్ని నియమాలను పాటిస్తూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని, పూజా ద్రవ్యాలను అందించామన్నారు. అలాగే  కోవిడ్ -19 కారణంగా పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో పూజా కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రసారం చేశామన్నారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు